నల్గొండ

యాదాద్రీశుడికి విశేష పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 17: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థానంలో మంగళవారం నిత్యారాధనలు, ఆర్జిత సేవలు సాంప్రదాయబద్ధంగా జరిగాయి. వేకువజామున సుప్రభాతంతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభించారు. తొలుత ప్రతిష్టామూర్తులకు ఆరాధన నిర్వహించిన పూజారులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం జరిపి తులసీ దళాలు, పట్టు వస్త్రాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. కవచ మూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయంలో వేద మంత్రోచ్ఛరణలతో స్వామి వారి నిత్య కల్యాణోత్సవాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం జరిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన అష్టోత్తరాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా దేవస్థాన క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రీతివారమైన మంగళవారం ఉదయం స్వామి వారి ఆలయంలో ఆంజనేయుడికి పంచామృతాలతో అభిషేకం జరిపి చందన లేపం అద్దారు. అనంతరం అర్చకులు స్వామి వారికి తమలపాకులతో సహస్త్ర నామార్చన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.