నల్గొండ

ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్త దాడులకు పాల్పడుతున్న మాజీ ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్ పోచంపల్లి సెప్టెంబర్ 23: ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు పశ్రీ్నస్తే మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి సమాధానం చెప్పకుండ అధికార పార్టీ కార్యకర్తలతో దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ యాదాద్రి జిల్లా అద్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు ఆరోపించారు. ఆదివారం మండలకేంద్రంలోని టూరిజం పార్కులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి పై మాజీ ఎమ్మెల్యే శే్వతపత్రం విడుదల చేయ్యలని ఆయన డిమాండ్ చేశారు. ఆపద్దర్మ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పలు సిసి రోడ్లు అభివృద్ధిపనులకు శంకుస్దాపన ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే అసమర్ధన వలన డబుల్ బెడ్ రూం నిర్మాణం జులాయిపల్లి కాలువ నిర్మాణ పనులు పూర్తికాక రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మేల్యే గా చేయాల్సిన పనులు చెయ్యకుండా క్యాన్లు పంపిణీ డబ్బా కొట్టుకుంటున్నారని ఆయన ఎద్దేవ చేశారు. మండలం కేంద్రంలో ప్రస్తుత డిగ్రీ కళశాల యాబై పడకల ప్రభుత్వ హాస్పిటల్ తీర్చిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ రాస్తారోకో..
ప్రజాసమస్యలపై మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిని ప్రశ్నిస్తే అదికారపార్టీకి చెందిన నాయకులు దాడులకు నిరసనగా ఆదివారం మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. పైళ్ళశేఖర్ రెడ్డి గుండాయిజం నశించాలని ఎమ్మేల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రదాన చౌరస్తా వద్ద నాయకులు కార్యకర్తలు రోడ్డు బైటాయించి రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు.నార్ల నర్సింగ్ రావు,బిజెపి మండల అధ్యక్షుడు చింతల రామకృష్ణ నాయకులు నోముల గణేష్ బి.లింగం, ఎస్ రంగారెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.