నల్గొండ

సాగర్‌లో సైనిక్ స్కూల్‌కోసం సిఎంకు గుత్తా లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూలై 3: నాగార్జున సాగర్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు కోరుతు ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎం కెసిఆర్‌కు లేఖ రాసినట్లుగా ఆదివారం తెలిపారు. ఏపిలో కేంద్రం రెండు సైనిక్ స్కూల్స్‌ను మంజూరు చేసిందని, కొత్త రాష్ట్రం తెలంగాణలో తెలంగాణలో నాగార్జున సాగర్‌లో సైనిక్ స్కూల్‌ను మంజూరు చేయాలని గతంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్‌లను కోరడం జరిగిందన్నారు. వరంగల్‌లో ఇప్పటికే మంజూరు ప్రకటించివున్నందునా మరొకదానిని సాగర్‌లో ఏర్పాటు చేయాలని ఇందుకు సీఎం కెసిఆర్ చొరవ తీసుకోవాలని గుత్తా తన లేఖలో కోరినట్లుగా తెలిపారు. సాగర్‌లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నెలవైన చరిత్రతో పాటు బౌద్ధ సందర్శన కేంద్రంగా, ప్రసిద్ధ నాగార్జున సాగర్ డ్యాంతో పర్యాటక కేంద్రంగా కొనసాగుతుందన్నారు. సాగర్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు ఇప్పటికే స్థలం సైతం గుర్తించడం జరిగిందని వెంటనే కేంద్రం సైనిక్ స్కూల్ మంజూరు చేసేలా సీఎం కెసిఆర్ చొరవ తీసుకోవాలని కోరినట్లుగా గుత్తా వెల్లడించారు.