నల్గొండ

ఆటో, ట్యాంకర్ ఢీ : ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్‌పహాడ్, జూలై 10: పొట్టకూటికోసం వచ్చి తిరిగి ఇంటికి ఆటోలో వెళ్తుండగా ఆటోను ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఇద్దరు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలపరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామశివారులో ఉన్న చెర్వు కట్టపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూర్(ఎస్) మండల కందగట్ల గ్రామానికి చెందిన కొందరు మండలంలోని పొట్లపహాడ్ గ్రామంలో ఒక రైతుకు చెందిన నిమ్మతోటలో పనికోసం వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమద్యలో సింగారెడ్డిపాలెం గ్రామశివారులో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఎల్లబోయిన శ్రీశైలం(32), భోనగిరి అంజయ్య(48), పోల్‌దాసు వెంకన్నలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108లో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా దురాజ్‌పల్లి గ్రామం వద్దకు రాగానే శ్రీశైలం మృతిచెందాడని, చికిత్స పొందుతూ అంజయ్య మృతిచెందాడని, వెంకన్న చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీశైలం భార్య నాగమ్మ ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రోబెషనరి ఎస్‌ఐ మల్లేష్ తెలిపారు. శ్రీశైలంకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అంజయ్యకు భార్య నలుగురు కుమార్తెలు ఉన్నారు.