నల్గొండ

దళితులపై జరుగుతున్న దాడుల్ని ఖండించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిరేకల్, జూలై 22: గుజరాత్‌లో మూడురోజుల క్రితం చనిపోయిన జంతు చర్మాలను తీస్తున్న దళితులపై హిందూ మనోన్మాద శక్తులు దాడులు చేయడాన్ని ప్రజలంతా ఖండించాలని పివైఎల్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ సతీష్ పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయపు దాడులపై పివైఎల్ ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ భావాజాలన్ని, మతద్వేషాలను పెంచి పోషిస్తుందన్నారు. ఈ సదస్సులో పివైఎల్ డివిజన్ కార్యదర్శి అంబటి చిరంజీవి, పట్టణ అధ్యక్షులు ఏపూరి అనిల్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసి డివిజన్ కార్యదర్శి రాయికృష్ణ, ఏఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు పలస యాదగిరి, పిడిఎస్‌యూ కో-కన్వీనర్ సతీష్, నాయకులు దేవయ్య, సైదులు, ఆనంద్, రవికాంత్, వెంకన్న, సురేష్, గోవర్థన్ పాల్గొన్నారు.