తెలంగాణ

తెలుగురాష్ట్రాల్లో వేడుకగా శ్రీరామనవమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లో రామాలయాలు శుక్రవారం ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రఖ్యాతి చెందిన భద్రాచలం, ఒంటిమిట్ట, రామతీర్థం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు ప్రతి పల్లెలో, కాలనీల్లో రామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సర్కారు భద్రాద్రిలో, ఎపి ప్రభుత్వం ఒంటిమిట్టలో అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ భారీ ఏర్పాట్లు చేశాయి. రామనవమి సందర్భంగా ప్రధాని మోదీ, రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.