తెలంగాణ

రూ. 200 కోట్ల వెంచర్‌ వెనుక నయీం హస్తం ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ శివారులో ఫ్రైడ్‌ ఇండియా గ్రూప్‌ వేసిన రూ 200 కోట్లు విలువైన వెంచర్‌ వెనుక నయీం హస్తం ఉందని తాజాగా సిట్‌కు పిర్యాదు అందింది. ఫ్రైడ్‌ ఇండియా వెంచర్‌ యజమానులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్కడ దేవతల గుట్టమీద ఉన్న దేవాలయాన్ని కూల్చివేశారని కొన్నాళ్లుగా స్థానికులు ఆందోళన చేశారు. ఆయల నిర్మాణం కోసం ఉద్యమిస్తున్నారు. నయీంకు ప్రధాన అనుచరుడిగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డ ఫ్రైడ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సనోవర్‌ బేగ్‌ నయీం బాటలోనే నడిచేవాడని, ఆయనకు మాఫియాతో లింకులు ఉన్నాయని, బంగారు స్మగ్లింగ్‌ చేసేవాడని స్థానికులు చెప్పారు. ఫ్రైడ్‌ ఇండియా అక్రమాలపై ఎవరికి పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు.