Others

నైమిశారణ్యం - పవిత్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం ఋషులందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. వారంతా బ్రహ్మదేవునికి నమస్కరించి మేము ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశాన్ని ఇవ్వమని అడిగారు. వారి మాటలకు బ్రహ్మదేవుడు సంతోషించారు. ‘నేను నా రథ చక్రాన్ని విసురుతాను. అది వెళ్లి ఆగిన చోట పవిత్రమైన ప్రదేశంగా భావించండి. అక్కడ మీరు మీమీ తపస్సులు, రచనలు సాగించండి. ఆ ప్రదేశం నేమి నిలిచిన చోటుకనుక నైమిశారణ్యంగా ప్రఖ్యాతి వహిస్తుంది. ’అని చెప్పాడు.
దాంతో ఋషులంతా ఆనాటినుంచి నైమిశారణ్యంలోనే తపస్సు సాగించారు. వ్యాసమహర్షి శ్రీభాగవతాన్ని రచించారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న గోమతీ నదీతీరంలో వ్యాసుల వారు వేదాలు విభజన చేశారు. శీరామచంద్రుడు కూడా ఈ నైమిశారణ్యంలో అశ్వమేధ యాగం చేశాడట. పాండవులు అరణ్యవాసకాలం ఇక్కడే గడిపారట. ఈ ప్రదేశాన్ని దర్శించటం, ఇక్కడ పురాణ కాలక్షేపం చేయడం, గోమతీ తీర్థంలో స్నానమాచరించటం లాంటివి పుణ్యప్రదాలు అని పెద్దలు చెబుతున్నారు.

- లక్ష్మీప్రియాంక