Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహంకారం పెరిగి పెరిగి
చతుర్ణామేవ గతి ర్వానరాణాం మహాత్మనాం
వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః
ఈ సముద్రాన్ని దాటి ఇక్కడ చేరగలగడం అనేది మహాత్ములైన నలుగురు వానరులకు మాత్రమే సాధ్యము. ఎవరువారు?
వాలిపుత్రుడు అంగదుడు-తండ్రిని చంపినవాని యందు చంపించిన వాని యందు ప్రతీకారాన్ని తీర్చుకొనే సామర్థ్యం లేక ప్రతి చిన్న సంఘర్షణకు ప్రాయోపవేశం చేసేవాడు. వాడీవేళ స్వామి దృష్టిలో మహాత్ముడు.
నీలుడు- సుగ్రీవ సేనాపతి. ఒకరి క్రింద బ్రతికేవాడు. ఇక తాను ఎవరి ఆజ్ఞ చేతను బయలుదేరడో, ఎవడు విడిచిన బాణంగా తనను తాను నమ్ముకొన్నాడో అటువంటి నిరహంకారి ఈవేళ అహంకారి అవుతున్నాడు. చివరివాడు-
బుద్ధిమంతుడైన తన రాజు సుగ్రీవుడు. తన భార్యనపహరించిన వాని నుండి భార్యను విడిపించుకొనటం చేతకాక, ఎవని సహాయాన్ని పొంది కార్యసాధన చేసికొన్నాడో ఆ సుగ్రీవుడు ఈవేళ రాముని కంటె సమర్థుడని స్వామి ఊహ.
ఇదీ త్రికూట మహాత్మ్యం.
ఒక్కసారి వచ్చి వాలినంత మాత్రాన బుద్ధిమతాం వరిష్టుడైన స్వామికే ఇంత అజ్ఞానరూప పతనం వచ్చిందే. సతతమూ ఆ కూట ము నందే ఉండే రావణుడెంత అహంకార మమకారాల్ని పొందాలి. అంతా పొది అలా సంచరించటంలో ఆశ్చర్యమేముంది! అయితే-
స్వామికి రావణునికి వున్న భౌదమే స్వామికి స్మృతిని కలిగించింది. తన ఆలోచనకు తానే పశ్చాత్తాపాన్ని పొందేటట్లు చేసింది. ఏమిటా భేదం-
స్వామి పరాశక్తి స్వరూపమైన సీతానే్వషణలో ఉన్నాడు. శ్రీమాతా స్వరూప సీతా ధ్యానంలో వున్నాడు. ఆ తల్లికి కూడా కూటస్థ అని నామముంది. ఇక్కడ కూటమంటే విశ్వ సమూహాల స్థితి. ఆమె దానియందు అధ్యక్ష్యం వహించి సాక్షిగా ఉంటుంది. అట్టి తల్లి అజ్ఞాన కారణ కూటస్థుడైన స్వామికి స్మృతిని కలిగించింది. తానెవరి గురించి ఆలోచింపవలెనో తానెవరి సామర్థ్యాన్ని నమ్మి ప్రవర్తించాలో తానెవరి కార్యార్థమూ వచ్చేనని అనుకొనాలో-అజ్ఞానాన్ని కలిగించింది. వెంటనే రామాభ్యుదయం జ్ఞాపకానికివచ్చింది. సరే-ఈ రాత్రివేళ పట్టణంలో ఎలా ప్రవేశించాలి? అని ఆలోచించేడు.
సూర్యే చాస్తౌం గతే రాత్రౌ దేహం సంక్షిప్త మారుతిః
పృషదంశక మాత్రస్సన్ బభూవాద్భుత దర్శనః
శరీరాన్ని సంక్షేపించి పిల్లి పరిమాణ మాత్రంగా సంచరిస్తానని అనుకొన్నాడు. ఇక్కడ మహర్షి ‘పృషదం శకమాత్రః’ అని ఊరుకోలేదు, ‘బభూవాద్భుత దర్శనః’ అన్నారు. పృషదంశకః అంటే రుద్రః అని అర్థం. స్వామి ఇపుడు రుద్రాంశతో శత్రుకర్శనుడవుతాడు. అలాగే అహంకార రూప అజ్ఞానం నశిస్తే కనిపించేదంతా అద్భుతమే అవుతుంది. విశ్వ రహస్యం తెలుస్తుంది. అనంత విశ్వంలో తన స్థానం తెలుస్తుంది. కూట జ్ఞానం నశించిన స్వామి అద్భుత దర్శనుడైనాడు. లంకా పట్టణంలో ప్రవేశిస్తాడు.
ఇక్కడవాల్మీకి మహర్షి లంకా పట్టణాన్ని వర్ణించే తీరు దాని బాహ్య ప్రకృతిని చెబుతుంది.
బంగారు పూత పూసిన గోడలు, బలమైన కోటలు, అత్యున్నతమైన ప్రాసాదలు, నవరత్నాలలు పొదిగిన హర్మ్యాలు, తీర్చిదిద్దిన రాజవీధులు-ఇవి మాత్రమే తరచూ కనిపిస్తాయి.
ఇంకావుంది...

- కాశీభొట్ల సత్యనారాయణ