Others

కాంగ్రెస్‌కు అంత ‘సీన్’ ఉందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తమ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకొంది. ఈ ఊపుతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసి, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ కార్యకర్తలు ఊహల్లో తేలియాడుతున్నారు. అయితే, ఈ గెలుపును ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ‘వాపు’గా భావించాలే తప్ప బలుపుగా పరిగణించరాదు. 1998లో వాజపేయి నాయకత్వంలో భాజపా కూటమి (ఎన్డీయే) అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో సీతారామ్ కేసరి నాయకత్వంలో ‘కోమా’లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సోనియా గాంధీ చేతికి వచ్చాయి. ఆమె రాకతో కొంత ప్రభావం కనిపించింది. అప్పుడు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో చాలామంది- సోనియా ప్రభంజనం దేశవ్యాప్తంగా వ్యాపించబోతున్నదని, ఆమె త్వరలో ప్రధానమంత్రి అవుతారని అంచనా వేశారు. ఆ తర్వాత ఏడాది కాలానికి 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక మరోసారి వాజపేయి ప్రధానమంత్రి పీఠంపై ఆసీనులయ్యారు.
2003లో జరిగిన ఉత్తరాది అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో వున్న రాష్ట్రాలను భాజపా దక్కించుకుంది. దీంతో తర్వాతి లోక్‌సభ ఎన్నికల్లో తమకే ప్రజలు పట్టం కడతారని ‘కమలనాథులు’ కలలు కన్నారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అనూహ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్లు పాలించారు.
ఇటీవలి ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకొన్న కాంగ్రెస్‌కు 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ అని చెప్పే పరిస్థితి లేదు. రాజస్థాన్‌లో భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగానే వుంది. మధ్యప్రదేశ్‌లో భాజపా కంటే కాంగ్రెస్‌కు ఐదారు సీట్లు ఎక్కువ వచ్చినప్పటికీ ఓట్ల పరంగా ‘కమలం’ పార్టీదే పైచేయి అయింది. ఇక, కాంగ్రెస్ ఖాతాలో ఉన్న మిజోరంలో అధికారాన్ని స్థానిక ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ దక్కించుకుంది. కానీ, ఛత్తీస్‌గఢ్‌లో గెలిచిన స్థానాల పరంగా కాంగ్రెస్, భాజపాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కొత్తగా పెట్టిన పార్టీ వల్ల భాజపాకు ఎక్కువ నష్టం జరిగింది. 15 సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో భాజపా అధికారంలో ఉన్నందున సహజంగా ఏర్పడే ‘ప్రభుత్వ వ్యతిరేకత’ కాంగ్రెస్ పార్టీకి వరంలా మారింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు కొంత బలం ఉన్నప్పటికీ కొన్ని తప్పిదాల వల్ల ఆ పార్టీకి చేదు అనుభవం మిగిలింది. కాంగ్రెస్ నాయకులు ‘పోల్ మేనేజ్‌మెంట్’లో వెనుకబడడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. తక్కువ సీట్లను సాధించినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా తమకు కొంత బలమైన ఓటు బ్యాంకు వుందని కాంగ్రెస్ నేతలు నిరూపించుకున్నారు. తెరాస అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు పలు సంక్షేమ పథకాలను తీసుకురావడంతో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఎదురైంది.
ఆరునెలల క్రితం కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అతి పెద్ద పార్టీగా భాజపా అవతరించింది. కానీ స్పష్టమైన మెజారిటీ లేనందున అధికారానికి దూరమైంది. తక్కువ సీట్లను గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ అండతో కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగలిగారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో మంచి ఫలితాలను రాబట్టగలమని భాజపా నాయకులు ధీమాగా ఉన్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన భాజపా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోల్చితే- 2019 ఎన్నికల్లో భాజపాకు 40 నుంచి 50 సీట్ల వరకూ నష్టం జరగవచ్చనే అంచనాలున్నాయి. సీట్ల తగ్గుదల అనేది ఉత్తరప్రదేశ్‌తో పాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించవచ్చు. ఉత్తరాదిలో గెలిచే సీట్ల సంఖ్య తగ్గినా, ఆ నష్టాన్ని బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాలలో భర్తీ చేసుకొనే అవకాశం ఉందని భాజపా నేతలు భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ‘ప్రభుత్వ వ్యతిరేకత’ తమకు అనుకూలిస్తుందని ‘కమలనాథులు’ విశే్లషిస్తున్నారు. ఎన్డీయే కూటమి నుంచి కొన్ని పార్టీలు బయటకు వెళ్లినా, ఇంకొన్ని పార్టీలు తమతో జతకట్టే అవకాశాలున్నాయని భాజపా నేతలు లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే స్వల్ప మెజారిటీతోనైనా నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని కావడం తథ్యమని వారు వాదిస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కొంత పరిణతి చెందిన నాయకునిగా మారి వుండవచ్చు. అయితే- మోదీ వ్యూహాల ముందు, వాగ్ధాటి ముందు, ప్రజాకర్షణ ముందు రాహుల్ నిలవగలరా? అన్నది అనుమానమే! రాహుల్‌కు మార్గదర్శనం చేసేందుకు జాతీయ స్థాయిలో పేరుప్రతిష్టలున్న నాయకులు కాంగ్రెస్‌లో లేకపోవడం గమనార్హం.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212