ప్రార్థన

జాగ్రత్త! మోసపోకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచకక్రియలను మహత్క్యార్యములను కనుపరచెదరు.’ - మత్తయి 24:24.
సంతోషంగా సమాధానంగా సుఖశాంతులతో ఉన్న ఆది కుటుంబములో ఉన్నట్టుండి గలిబిలి గందరగోళం అసమాధానము అసంతృప్తి కష్టం నష్టం అన్నీ ఒక్కసారిగా మొదలయ్యాయి. ఏదేను తోటలోనికి సాతానుడు ప్రవేశించి హవ్వను మొదట మోసపరచాడు. హవ్వ ఆదామును మోసం చేసింది. అక్కడ నుండి మోసమనేది పెరుగుతూ లోకమంతా వ్యాపించింది. ఎక్కడ చూసినా మోసమే. ఎటు చూసినా మోసమే. భార్య భర్తను మోసం చేస్తుంటే భర్త భార్యను మోసం చేయటం తల్లిదండ్రులను పిల్లలు మోసం చేయటం, పిల్లలు తల్లిదండ్రులనే కాదు టీచర్లను మోసం చేయటం, ఒకరినొకరు మోసం చేసుకోవటం వల్ల చివరికి అర్థమయ్యేది వారిని వారే మోసం చేసుకున్నారని. ఇంకా చూస్తే - వ్యాపారాలలో మోసం, వైద్యరంగంలో మోసం, విద్యారంగంలో మోసం. పూర్వం వైద్య, విద్య రంగాలు ఎంతో గొప్ప సేవ చేసి గొప్పవారినిగా తీర్చిదిద్దారు. ఉచితంగా సేవలందించారు. ఇప్పుడు ఎటు చూసినా మోసమే. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి మోసం చేస్తున్నారు. తినే ఆహారం కూడా మోసమే. చివరకు పండ్లు, ఫలాలు కూడా మోసమే. దేవుడు ఉచితముగా ఇచ్చేవాటికి రంగులు వేసి మోసం చేస్తున్నారు. నిజానికి ఒకప్పుడు మామిడికాయ గానీ అరటి పండుగానీ వాటి రంగు చూసి కొనేవాళ్లం. ఇప్పుడు రంగు రంగులుగా ఉంటున్నాయి గానీ మొదట్లో ఉన్న రుచి ఉండటంలేదు. కారణం ఆజచిజషజ్ఘ జఔళశజశ ఛిఖజఆఒ. చూపులకు మాత్రమే రమ్యముగా ఉంటున్నాయి. రుచి ఉండటం లేదు. ఒకవేళ రుచి ఉన్నా మనకు హాని కలిగించే పదార్థము వాటిలో ఉండుట వల్ల ఇంకా ఎక్కువగా మోసపోతున్నాము. తినే ఆహారంలో ఈ మోసమేంటి అని ఆలోచిస్తే మొదట హవ్వను మోసపరచినది ఈ ఆహారానికి సంబంధమైనది. ఆదిలో మొదలైన మోసము ఇంకా నడుస్తూనే ఉంది. అది మోసమని తెలిసినా పడకుండా ఉండలేక పోతున్నారు.
‘ఫ్రీ’ అనే మాట మోసమని తెలిసినా ఉచితము అనగా ఇక పరుగెత్తుతున్నారు. ఒక్క సెకను ఆగండి. ఫ్రీగా ఇచ్చేవాళ్లు మన బాబాయి కాదు, అన్న కాదు, అక్క కాదు, డబ్బు కోసం నానా గడ్డి తింటున్న ఈ రోజుల్లో నీకు ఫ్రీగా ఎందుకు ఇస్తాడు ఆలోచించండి. ఒకవేళ బావ వరస వాళ్లు ఫ్రీగా ఇస్తామన్నా ముందు వెనుక ఆలోచించండి. ఏదైనా మోసం దాగి ఉండవచ్చు. ఎవరిని మ్రింగుదుమా ఎలా తిందామా అని ఎదురుచూస్తున్న ఈ రోజుల్లో ఉచితంగా, ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరూ పనికట్టుకొని కోట్లు ఖర్చుపెట్టి యాడ్స్ ఇచ్చి మనలను పిలువరని తెలుసుకోవాలి. మోసాన్ని గ్రహించే జ్ఞానం ఉండాలి. మాయలో పడిపోకూడదు.
మాయ మాటలు, మంచి మాటలలాగా చెప్తూ మోసం చేస్తున్నారు. తీయని మాటలు మాట్లాడినంత మాత్రాన మంచి ఉంటుందనుకోకూడదు. జారస్ర్తి పెదవుల నుండి తేనె కారును. దాని మాటలు నూనె కంటెను నునుపైనవిగా ఉండవచ్చు. ఎంత కమ్మగా మాట్లాడుతోంది అని మోసపోయి దాని వెనుకపడి భార్యాబిడ్డలను తల్లిదండ్రులను వదిలి ఇల్లూ వాకిలీ వదిలి అన్నీ పోగొట్టుకున్న తరువాత అర్థవౌతుంది మోసపోయిన సంగతి. అప్పటికి జరగవలసిన నష్టం పెద్ద మొత్తంలో జరిగి ఉండవచ్చు. ఈ పరిస్థితులను తట్టుకోలేని తల్లిదండ్రులు, పిల్లలు మానసిక వత్తిడికి గురై ఆరోగ్యం పోగొట్టుకొని చివరకు ప్రాణాలు కూడా పోగొట్టుకొని ఉండవచ్చు. అక్కడ దాని అప్పులు, గొడవలు, కొట్లాటలు, కోర్టు కేసులు, రోగాలు, బాధలు.. ఇవిగాక ముందు మోసపోయిన వాడి బెదిరింపులు ఇలా అన్నీ చుట్టుకొని నిద్రాహారాలు లేక ఆరోగ్యం చెడిపోయినప్పుడు, కుమారులారా! నా మాట ఆలకించుడి. నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్ర్తి యుండు చాయలకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్లకుము. వెళ్లిన యెడల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను? నా బోధకుల మాట నేను వినకపోతిని. నా ఉపదేశకులకు చెవి యొగ్గలేదు. (సామెతలు 5:7-13) అని ఎంతగా బాధపడినా ఉపయోగముండకపోవచ్చు. జాగ్రత్త! నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా? అన్యులు నీతో కూడా వాటి ననుభవింపకుండా అవి నీకే యుండవలెను గదా. మనము మోసములో పడినందుకు మొదలుకే మోసము జరుగును.
మంచి చెప్పేవారు చెడ్డగాను మోసగాళ్లగాను, అబద్ధాలు ఆడి మోసాలు చేసేవారు చాలా మంచివారుగానూ కనపడుచున్నారు. అందుకే లోకము తల్లక్రిందులైనట్టు ఉంది. కత్తితో మనుషులను చంపినట్లే, అబద్ధపు మాటలతో మోసపు మాటలతో ఆత్మను చంపుచున్నారు. గనుక, మనిషిని చంపుట ఎంత పాపమో మోసము చేయటం కూడా అంతే పాపము. వాళ్లు మోసం చేశారు గనుక మేము కూడా చేస్తున్నాము అని చాలామంది సమర్థించుకుంటూ మోసపు లోకాన్ని సృష్టిస్తున్నారు.
వంద రూపాయలు ఇస్తే నెలకు రెండు వందలు ఇస్తామనే మోసం ఆ మధ్య చాలాచోట్ల జరిగింది. వందకు రెండు వందలులాగ కొన్ని నెలలు ఇచ్చి నమ్మించారు. ఇంకేముందు ‘డబ్బులు’ అధికంగా వస్తున్నాయని అప్పులు చేసి మరీ వేలకి వేలు తెచ్చి కట్టారు. ఈ మొత్తము డబ్బుతోనే మోసము జరిగిందని పోలీసులను ఆశ్రయించారు. ఇంకొక సంగతి. పోలీసులు కూడా మనుషులే కదా వాళ్లను కూడా అనేక మంది నమ్మించి మోసం చేశారు. పెద్ద అధికారికి ‘కోటి రూపాయలు నీ పేరున లాటరీ వచ్చింది. ఐదు లక్షలు ఒక నెంబర్‌కి జమచేస్తే నీ కోటి రూపాయలు నీకు వెంటనే వస్తాయి’ అనేసరికి ఏమీ ఆలోచించకుండా ఐదు లక్షలు జమ చేసిన తరువాత తెలిసింది మోసపోయిన సంగతి. మామూలు వారైతే అధికారుల నాశ్రయించవచ్చు. మరి అధికారులే అలా చేస్తే ఎక్కడికి వెళ్లి చెప్పగలరు.
దీనికంతటికి కారణము హృదయము అన్నింటి కంటె మోసకరమైనది. మానవ హృదయాన్ని సాతానుడు మోసముతో ఆక్రమించాడు. కాబట్టి మోసమే జరుగుచున్నది. ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు కానీ అసలు ఎవరికి వారు మోసపోతున్నారు. యేసు ప్రభువిచ్చిన ఆజ్ఞ ఒకే ఒక ఆజ్ఞ. ఒకరినొకరు ప్రేమించమని. ఇది కేవలము క్రీస్తుకు కలిగిన మనసు మనము కలిగి ఉంటేనే దేవుడు కోరినట్లు ప్రేమించగలము. ఆత్మీయంగా అనారోగ్యంతో ఉన్న హృదయాలు ఆరోగ్యముగా ఉన్నాయనుకోవటమే అసలు మోసం. మాకేమి మేము మంచివారమనుకొని అనేకులు జీవిస్తున్నారు. అయితే ఈ వ్యాధిని మనుషులైనా ఎంత పెద్ద వైద్యులయినా కనుగొనలేరు గానీ యేసు ప్రభువు హృదయాలోచనలు ఎరిగినటువంటి వాడు. అంతరింద్రియములను పరిశోధించువాడు. గనుక ప్రభువు కనుగొనగలడు. మనము నిర్మించబడిన రీతి ఆయన ఎరుగును. ఆదికాండము ఆరవ అధ్యాయములోనే నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి జల ప్రళయముతో నాశికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగల ప్రాణులన్నిటిని తుడిచివేసెను. నీతిమంతుడైన నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నియు మిగిలి యుండెను. అయినా మరలా మోసాలు దుష్టత్వము పెరిగిపోయి నోవహు దినములలో జల ప్రళయమునకు ముందు ఉన్నట్టుగానే ఇప్పటిరోజులు ఉంటున్నాయి. అప్పుడైతే నీటి వరదలో వారిని నాశనము చేసిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. ఎవడు నశించుట దేవుని ఇష్టము కాదు గనుక ఆయన రాకడ సమయము పొడిగించబడుతోంది. కొంతమందైనా మారుతారని ప్రభువు చూస్తున్నాడు.
మోసము చేయటము పాపమే. దేవుడు ఇంత తెలివితేటలు జ్ఞానము ఇచ్చి అనేక విషయములు అనేక ఉపమానములు అనేక సాక్ష్యములు మన ముందుంచిన తరువాత కూడా మోసపోయినా పాపమే.
అందుకే ప్రభువు సెలవిస్తున్నాడు మోసపోకండి అని.
వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. -ఎఫెసీ 5:6-7.
మోసపోకుడి. అన్యాయస్థులైన జారులైన వ్యభిచారులైన పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
అసలు దేవుడంటే ఎవరనుకుంటున్నారు. మనమేమీ చేసినా ఎలా చేసినా చూస్తూ ఉంటాడనుకుంటున్నారా? ఇష్టమొచ్చినట్టు జీవించి మోసాలు చేసి సంపాదించి దానిలో కొంత తీసికెళ్లి హుండీలో వేస్తే అంతా సరైపోతుందనుకొని మోసపోతున్నారో జాగ్రత్త! దేవుడు కోరుకునేది నీ బలులు నైవేద్యము కాదు. నీ హృదయములో పరిశుద్ధత కోరుకుంటాడు. నీ హృదయ శుద్ధి కోసమే ఆయన రక్తము చిందించాడు. ఆయన రక్తములో కడుగబడినవారమై శుద్ధ హృదయము కలిగి జీవించాలని ప్రభువు కోరిక.
మోసపరచే వారి మోసములో పడకుండా ఉండాలంటే దైవజ్ఞానము కావాలి. ఈ లోక జ్ఞానముతో మోసాన్ని ఎదుర్కోలేము. మోసానికి గురువు సాతానుడు. ఎంతో సీనియర్. కనుక చాలా సులభంగా మోసపరుస్తాడు. దైవ జ్ఞానానికి మూలము దేవుని యందు భయభక్తులు. ఇంకా జ్ఞానము కావాలంటే ప్రభువును అడుగవలెను. దేవుడు తప్పక ఇస్తాడు. ప్రభువు ఎవరినీ గద్దింపక అందరికినీ ధారాళముగా దయ చేయువాడు.
డెలీలా మోసములో పడి మహా బలము గల సంసోను ఎలా బలహీనుడయ్యాడో మనకు తెలుసు. ఒక్కొక్కసారి భక్తి ముసుగులో మోసము చేస్తున్నారు. సమాధాన బలులను నేను అర్పించవలసి యుంటిని నేడు నా మ్రొక్కుబడులు చెల్లించి యున్నాను కాబట్టి నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరి రాగా నీవే కనపడతివి (సామెతలు 7:14) ఇదెక్కడి చోద్యమో చూడండి. మ్రొక్కుబడి చెల్లించి సమాధాన బలులర్పించి, దేవుని సన్నిధిలో ఈ మాటలేమిటి ఆలోచించండి. భయం భక్తి లేకుండా మోసకరమైన జీవితాలు జీవించరాదు. దేవునికి మరుగైనదేదీ లేదు. చీకటియైన ఆయనకు చీకటి కాదు. ఆయన చూడలేని చీకటి లేదు.
ఎన్నో విషయాలు వివరంగా చెప్పిన యేసు వారితో ఇట్లనెను. ‘ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి’ - మత్తయి 24:4
అన్ని విషయాలు శ్రద్ధగానే వింటున్నారు. అయితే వినేవారుగా మాత్రముంటున్నారు. విని వాక్యానుసారముగా నడువక పోతే మనలను మనము మోసము చేసుకొన్నట్టే. విని ఉపయోగము లేదు. సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి యుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
అనేకులు నా పేరిట వచిచ నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు (మత్తయి 24:5) అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్క్యార్యములను కనపరచెదరు (మత్తయి 24:24) ఏర్పరచబడిన వారే మోసపోతే మామూలు మనుషుల సంగతేమిటి?
గొప్ప సూచక క్రియలు మహత్క్యార్యములే కాదు గానీ దేవుని సత్యవాక్యాన్ని బోధిస్తున్నారా లేదా అని గ్రహించాలి. అంటే సత్యము అంటే ఏమిటో తెలిసి ఉండాలి. అంటే దీనిని బట్టి దేవునిలో ఎంత బలముగా ఉండాలో మనకు అర్థవౌతుంది. నేనే క్రీస్తునని అనేకులు వచ్చినప్పుడు అది ఎలా తెలుస్తుంది? అసలు క్రీస్తు ఉన్నాడు గనుక నకిలీలను సాతానుడు సృష్టిస్తున్నాడని అర్థవౌతుంది. సిలువపై వేలాడబడిన యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు. ఆయన తన రక్తము చిందించి మన పాపాలకు వెల చెల్లించాడు. ఆ ప్రేమ మనకు కనపడుతోంది. నిస్వార్థం కనపడుతోంది. కనికరం క్షమాపణ సహనం ఓర్పు కనపడుతాయి. ఎంత ఎక్కువ ప్రభువుతో సహవాసం చేస్తే అంత తేటగా ఆయన లక్షణాలు తెలుస్తాయి. దానిని బట్టి క్రీస్తు అరణ్యములో ఉన్నాడు. లోపలి గదిలో ఉన్నాడని చెప్పినా గొప్ప సూచక క్రియలు మహత్క్యార్యములు చూయించినను అది సత్యమో అసత్యమో మనకు అర్థవౌతుంది.
నకిలీ కరెన్సీని గుర్తుపట్టకపోతే ఎంత మోసపోతామో, నకిలీ క్రీస్తులను గుర్తుపట్టకపోతే అంతే మోసపోతాము. జాగ్రత్త! మెలకువ కలిగి ఉండాలి. వాక్య ధ్యానములో ఉండాలి. ప్రార్థనలో ఉండాలి. పరిశుద్ధుల సహవాసములో ఉండాలి. ఆత్మానుసారముగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. సాతానుని ఎదిరించాలి. దేవునికి లోబడి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. జ్ఞానము కలిగి ఉండాలి. వాక్య ఖడ్గము ధరించుకొని సర్వాంగ కవచము ధరించుకొని ఎటువంటి మోసాలలో పడకుండా ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడై యుండి నడిపించునుగాక.
మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పి యున్నాను. -మార్కు 13:23.

- మద్దు పీటర్ 9490651256