తెలంగాణ

నవీన్ మిట్టల్‌ పర్సనల్‌ సెక్రటరీ పద్మావతి బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌ పర్సనల్‌ సెక్రటరీ పద్మావతిని ప్రభుత్వం బదిలీ చేసింది. పద్మావతి వేధిస్తోందంటూ తెలంగాణ సచివాలయ ఉద్యోగులు బుధవారం ఉదయం కూడా నిరసనకు దిగారు. పీఎస్‌గానే వేధిస్తున్న పద్మావతిని అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమిస్తే వేధింపులు ఎక్కువ అవుతాయని ఉద్యోగులు ఆరోపించారు.ఆమెను తొలగించకుంటే పెన్ డౌన్‌కు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు. చర్చలకు పిలిచినా ముందు పద్మావతిని తొలగించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో పద్మావతిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పద్మావతి మీడియాతో మాట్లాడుతూ ఎవరినీ ఎప్పుడు వేధింపులకు గురిచేయలేదని, అలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్లిపోతానన్నారు.