తెలంగాణ

ఆధ్యాత్మిక కవి రామానుజాచార్యులు ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆధ్యాత్మిక పండితుడిగా, కవిగా, వ్యాఖ్యాతగా తెలుగువారికి చిరపరిచితమైన శేషం రామానుజాచార్యులు శనివారం ఉదయం నగరంలోని వనస్థలిపురంలో కన్నుమూశారు. తిరుమల బ్రహ్మోత్సవాలతో పాటు యాదగిరిగుట్ట వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. పలు పత్రికల్లో వ్యాసాలు రాసిన ఆయన ఆకాశవాణిలోనూ విభిన్న భక్తిప్రధాన కార్యక్రమాలకు రూపకర్తగా ఎంతో పేరు గడించారు. పలు ఆధ్యాత్మిక గ్రంథాలను వెలువరించిన ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామానుజాచార్యులు మృతిపట్ల ఆధ్యాత్మిక, సాహితీ రంగాలకు చెందిన వారు సంతాపం వ్యక్తం చేశారు.