రంగారెడ్డి
ఔషద రంగంలో పరిశోధనలు అవసరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 November 2018
బాలానగర్, నవంబర్ 15: ఔషద రంగంలో పరిశోధనలు అవసరమని గవర్నర్ ఈఎస్ఎల్ నరసంహన్ అన్నారు. బాలానగర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) లో ఏర్పాటు చేసిన 7వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైద్యో నారాయణో హరి అనే సూక్తినే ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. నూతన ఔషదాల తయారీపై పరిశోధన చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. రాబోయో రోజుల్లో ఫార్మా రంగంలో మంచి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. డాక్టర్ రెడ్డి లోబోరటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఐడీపీఎల్తో అభినవభావ సంబంధం ఉందని, 1992లో రెడ్డి ల్యాబ్స్కు శ్రీకారం చుట్టారని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ మసూమ్, డైరెక్టర్ శశిబాల సింగ్ పాల్గొన్నారు.