రంగారెడ్డి

తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే ప్రభంజనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 9: టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించబోతుంది. కేసీఆర్ రెండో సారి సీఎం కాబోతున్నారని టీఆర్‌ఎస్ మేడ్చల్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బోడుప్పల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు చర్ల ఆంజనేయులు యాదవ్, ప్రధాన కార్యదర్శి పులకండ్ల జంగారెడ్డి, నేతలు బొమ్మక్ బాలయ్య, జడిగె రమేశ్, నత్తి మైసయ్య, బొబ్బల లక్ష్మారెడ్డి, కొత్త చక్రపాణి గౌడ్, కే.నర్సింహ, సాయిని అమృతం, మల్లేష్, వెంకటేశ్ యాదవ్ మాట్లాడుతూ పోలింగ్ సరళి టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉందన్నారు. ఎగ్జిట్ పోల్స్ సైతం పార్టీకి అనుకూలంగా చెపుతున్న నేపథ్యంలో అన్ని స్ధానాల్లో టీఆర్‌ఎస్ ఘన వియజం సాధిస్తుందని, కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని పేర్కొన్నారు. ప్రజా కూటమి, ఇతర పార్టీలు గంగలో కలిసిపోతున్నాయని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి విజయం కోసం అహర్నిషలూ పని చేసిన పార్టీ శ్రేణులకు, కాలనీల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు జరిగేలా పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
పైలెట్ రోహిత్ కుమారుడి డోలారహణం
తాండూరు, డిసెంబర్ 9: తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పంజుగుల పైలెట్ రోహిత్ రెడ్డి కుమారుడి డోలారహణం కార్యక్రమం ఆదివారం తమిళనాడులోని చెన్నై నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. కాగా 21 రోజుల క్రితం రోహిత్ రెడ్డికి కుమారుడు జన్మించాడు. 21వ రోజు డోలారహణం కార్యక్రమం చెన్నై నగరంలో నిర్వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సమీప బంధువు ఆర్తి రోహిత్ రెడ్డి సతీమణి దంపతులకు రెండవ సంతానం అయిన బాబును రజనీకాంత్ ఆశీర్వదించారు. డోలారోహన కార్యక్రమంలో తాండూరుకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు సైతం పాల్గొన్నట్లు సమాచారం. రోహిత్ రెడ్డి సూపర్ స్టార్ రజనీకాంత్ బంధువులుగా తెలుస్తోంది.