రంగారెడ్డి
ఉపాధికి ప్రత్యామ్నాయం అనే్వషించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఘట్కేసర్, ఏప్రిల్ 24: యువత స్వయం ఉపాధి కొరకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి నిరుద్యోగులకు అవకాశాలను కల్పించాలని పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి అన్నారు. ఘట్కేసర్లోని జాతీయ రహదారిపై నందం చంద్రశేఖర్, నందం గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మ్యుచువల్ ఏయిడెడ్ కోఆపరేటివ్ త్రిప్ట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ను, ఎన్ఎఫ్సినగర్లోని నందం హిల్ కాలనీలో ఏర్పాటుచేసిన చేనేత మగ్గాలపై పట్టు చీరలు తయారీ, శిక్షణ కంపెనీలను బుధవారం సాయంత్రం ప్రారంభించారు. వినియోగదారులకు విశిష్ట సేవలు అందించి తద్వారా లాభాలను ఆశించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ఏదులాబాద్ రోడ్డులో నందం గణేష్, ఎన్వై భానుప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రయాణికుల ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఘట్కేసర్ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.