రంగారెడ్డి

ముంపు ప్రాంతాల అభివృద్దికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, అక్టోబర్ 21: నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. లింగోజిగూడ డివిజన్ జీజేఆర్ గార్డెన్ పక్కన గల రోడ్డులో సీసీరోడ్డు, మైత్రినగర్ కాలనీలో సీసీరోడ్డు రిస్టోరేషన్ పనులకు సోమవారం కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం నాటికి ముంపు సమస్య లేకుండ శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. ఇప్పటికే ఇక్కడ బాక్స్‌టైప్ పనులు చేపట్టినట్లు తెలిపారు. సాగర్‌రింగ్‌రోడ్డులో డ్రైనేజీ పైప్‌లైన్ పగిలిపోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చిందని గుర్తుచేశారు. త్వరలో పనులను పూర్తి చేసి డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తిలక్‌రావు, నాయకులు దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, చింతల శ్రీ్ధర్, నర్రె శ్రీనివాస్‌కురుమ, శ్రీకాంత్, ఇంద్రజీ పాల్గొన్నారు.