రంగారెడ్డి

సమస్యల పరిష్కారం కోసం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, అక్టోబర్ 21: కాలనీ వాసుల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చెప్పారు.నాగోలు డివిజన్ సెవెన్ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కత్తుల రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం కాలనీ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని ఆయన నివాసంలో కలసి శాలువతో సన్మానించారు.తమ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కారం చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమలాకర్, వెంకటేష్, పూలమ్మ, రాంగోపాల్, విజయలక్ష్మీ, రాజేష్ పాల్గొన్నారు.