రంగారెడ్డి

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, మే 27: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని చర్లగూడలో జరిగింది. షాబాద్ ఎస్‌ఐ శ్రీ్ధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చర్లగూడ గ్రామానికి చెందిన పడగంటి రవీందర్‌రెడ్డి(40) తనకున్న 4 ఎకరాల పొలంలో పత్తి, మొక్కజొన్న, పంటలు సాగు చేశాడు. గత కొనే్నళ్లుగా వర్షం సరిగ్గా కురియకపోవడంతో పంట దిగుబడి రాలేదు. దీంతో అప్పులు ఎక్కువ కావడంతో ఏం చేయాలో తెలియక బాధపడుతూ తన కుటుంబ సభ్యులతో చెప్పి ఆవేదన చెందుతుండేవాడు. అతని కుమార్తె నిఖితారెడ్డి బిటెక్ చదువుతుండగా, కుమారుడు వంశీధర్‌రెడ్డి పదవతరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి తన పిల్లలతో వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నాడు. వారి చదువులకు డబ్బులు ఎక్కడ నుండి తేవాలని బాధపడ్డాడు. శుక్రవారం తన పక్కపొలంలోని వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తేలిపారు.