రంగారెడ్డి

జడ్పీటిసి, సర్పంచ్ సహా 14మంది బైండోవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 17: జడ్పిటిసి, సర్పంచ్ సహా 14 మందిని పోలీసులు తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసిన సంఘటన ధారూర్ మండలంలో జరిగింది. వివరాలలోకి వెళితే మండలంలోని కుక్కింద గ్రామానికి చెందిన రాములు జడ్పీటిసి, ఆయన భార్య మాణమ్మ గ్రామ సర్పంచ్. గత కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవల కారణంగా జడ్పీటిసి, సర్పంచ్ మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా శుక్రవారం జడ్పీటిసి రాములు, సర్పంచ్ మాణమ్మ సహా మరో 12మందిని తహశీల్దార్ శ్రీనివాస్ ఎదుట బైండోవర్ చేశారు. జడ్పీటిసి రాములు మూడు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు.