రంగారెడ్డి

వైఎస్‌ను తలపిస్తున్న కేసిఆర్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, జూన్ 17: బలిదానాలతో సాధించిన తెలంగాణలో కేసిఆర్ పాలన అప్పటి వైయస్‌ఆర్ పాలనను తలపిస్తోందని ఓయు విద్యార్ధి జెఎసి తీవ్రంగా ఆరోపించింది. ఓయు ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో నిరుపేద రైతుల భూములను ముంపునకు గురిచేస్తున్నారని తెలిపారు. భూమిని కోల్పోతున్న మల్లన్న సాగర్ ముంపుబాధితులకు తిరిగి భూమిని ఇవ్వాలని విద్యార్ధి జెఎసి డిమాండ్ చేస్తోందన్నారు. 5 టిఎంసిల ప్రాజెక్టును 50 టిఎంసిలకు పెంచి రైతులను ఎందుకు ముంచుతున్నారని వారు ప్రశ్నించారు. బహుళజాతి కంపెనీలకు నీరందించడానికే కోట్లు తీసుకుంటూ మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరుతో రైతులను ముంచుతున్నారని తెలిపారు. మల్లన్న సాగర్‌లో భూమి కోల్పోయిన రైతులకు అండగా ఓయు విద్యార్ధి జెఎసి ఉంటుందని భూమికి బదులు భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు బాలలక్ష్మీ, భాస్కర్, కళ్యాణ్, ఎల్లన్న, సాంబగౌడ్ తదితరులు పాల్గొన్నారు.