రంగారెడ్డి

ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి విఫల యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 17: ఆంధ్రాబ్యాంక్‌లో దొంగలు చోరీకి విఫలయత్నం చేసిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సుచిత్ర, వెనె్నలగడ్డలోని సెయింట్ ఆంథోని స్కూల్ భవనంలోని ఆంధ్రాబ్యాంక్ జీడిమెట్ల బ్రాంచ్ కొనసాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 నుండి 4 గంటల మధ్యలో ముగ్గురు దుండగులు షట్టర్ తాళాలను పగులగొట్టి బ్యాంక్ లోపలికి ప్రవేశించారు. ముందుగా సిసి కెమెరాల వైర్లను కట్‌చేసిన అనంతరం సైరన్ మోగకుండా వైర్‌లను కట్‌చేశారు. లాకర్ రూమ్ తెరిచేందుకు దొంగలు ప్రయత్నించగా బిల్డింగ్ యజమాని సుందరరాజు కిందకు వస్తుండటాన్ని గమనించిన దొంగలు ఎవరో వస్తున్నారని అక్కడి నుండి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు వచ్చేలోపే దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. బాలానగర్ జోన్ ఇన్‌చార్జి డిసిపి సాయిశేఖర్, పేట్‌బషీరాబాద్ ఏసిపి అశోక్‌కుమార్, సిఐ డివి రంగారెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీమ్ ద్వారా వేలిముద్రలను సేకరించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి యత్నించిన వారిలో ఓ దొంగ పోలీసులకు చిక్కినట్టు సమాచారం.