రంగారెడ్డి

కారు అద్దాలు పగులగొట్టి నగదు, పత్రాలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30: ఆగి ఉన్న ఇన్నోవా కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న ఐదు లక్షల రూపాయల నగదు, విలువైన పత్రాలు చోరీ చేసిన ఘటన ఇబ్రహీంపట్నంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సిఐ జగదీశ్వర్, బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రామంతాపూర్‌కు చెందిన వ్యాపారి ఆంథోనీ.. సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టేషన్ పని నిమిత్తం వచ్చి సమీపంలో కారును నిలిపాడు. కార్యాలయంలో పని ముగించుకొని తిరిగి వచ్చే సరికి కారులో ఉన్న ఐదులక్షల రూపాయల నగదు, భూములకు సంబంధించిన విలువైన పత్రాలు, బ్యాంకు ఖాతా పాసుపుస్తకాలను గుర్తుతెయని వ్యక్తులు.. ఇన్నోవా అద్దాలు పగులగొట్టి చోరీ చేశారు. బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సిఐ జగదీశ్వర్, స్థానిక పోలీసులు సబ్‌రిజిస్టార్ కార్యాలయం పరిసరాల్లోని సిసి కెమెరా ఫూటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.