తెలంగాణ
ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 November 2019
మహబూబ్నగర్: మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో జరిగింది. హైకోర్టు తీర్పు ఎలా వస్తుందోనని మనస్తాపానికి గురైన ఆర్టీసీ కార్మికుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న ఆవుల నరేశ్ అనే కార్మికుడు ఈరోజు తెల్లవారుజామున పురుగుల మందు తాడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నరేశ్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న తోటి కార్మికులు, అఖిలపక్ష నేతలు ఆసుపత్రికి తరలివచ్చారు. డ్రైవర్ నరేశ్ మృతదేహంతో ర్యాలీగా వచ్చి డిపోలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవటంతో మృతదేహంతో డిపో ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.