తెలంగాణ
సిరిసిల్ల జిల్లా కోసం 48 గంటల బంద్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 September 2016
కరీంనగర్: సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన సమితి నేతృత్వంలో మంగళవారం ఉదయం నుంచి 48 గంటల బంద్ ప్రారంభమైంది. తెల్లవారు జామునుంచే ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను అడ్డుకున్నారు. రోడ్లపై పాతటైర్లను దగ్ధం చేసి రాస్తారోకోలు ప్రారంభించారు. ఒక ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఓ పెట్రోలు బంకుపై దాడి చేసి అక్కడ అద్దాలను పగులగొట్టారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. నేత కార్మికులు విధులకు స్వస్తి పలికారు. జిల్లాను సాధించేవరకూ ఆందోళన విరమించేది లేదని సాధన సమితి నేతలు తెలిపారు. బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.