క్రీడాభూమి

ఢిల్లీ చేతిలో పాట్నా చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 9: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం ఏకపక్షంగా జరి గిన మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ జట్టు పటిష్టమైన పాట్నా పైరేట్స్‌ను 18 పాయంట్ల తే డాతో చిత్తుచేసింది. ఢిల్లీ 33 పాయంట్లు సంపాదించగా, పాట్నా అనూహ్యంగా 15 పాయంట్లకే పరిమితమైంది. ఢిల్లీకి నాయకత్వం వహించిన మిరాజ్ షేక్ ఆరు పా యంట్లు చేయగా, సచిన్ షింగాడే నాలుగు పాయంట్లు సాధించాడు. సెల్వమణి, సు రేష్ కుమార్, సంకేత్ చవాన్, వికాస్ ఖండోలా తలా మూడేసి పాయంట్లు తమ జట్టు కు అందించారు. పాట్నా తరఫున అబొల్‌ఫజల్ మసోడ్లో ఐదు పాయంట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారు ఏమాత్రం రాణించలేకపోయారు.
బెంగాల్ వారియర్స్‌ను ఓడించిన పునేరీ పల్టన్: మరో మ్యాచ్‌లో పునేరీ పల్టన్ జట్టు ఏడు పాయంట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ పై విజయం సాధించింది. పునేరీ 38 పాయంట్లు సాధిస్తే, బెంగాల్ 31 పాయంట్లకు పరిమితమైంది.

చిత్రం.. ఢిల్లీ, పాట్నా జట్ల మ్యాచ్‌లో ఓ దృశ్యం