క్రీడాభూమి
భారత్, జపాన్ మహిళల హాకీ మ్యాచ్ డ్రా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రియో డి జెనీరో: భారత్, జపాన్ జట్ల మధ్య మహిళల గ్రూప్ ‘బి’లో జరిగిన మొదటి లీగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ సాధించాయి. ఆరంభంలో వెనుకబడినప్పటికీ, ఆతర్వాత కోలుకున్న భారత్ ఓటమిని తప్పించుకోవడం విశేషం. మ్యాచ్ 15వ నిమిషంలో ఎమీ నిషికోరి, 28వ నిమిషంలో మీ నాకషిమా ద్వారా జపాన్కు రెండు గోల్స్ లభించాయి. ఈ దశలో తీవ్రమైన ఒత్తిడికి గురైన భారత్ ఎదురుదాడికి ఉపక్రమించింది. 31వ నిమిషంలో రాణి రాంపాల్ మొదటి గోల్ చేయగా, మరో తొమ్మిది నిమిషాల తర్వాత లీలిమా మిన్జ్ ఈక్వెలైజర్ను సాధించింది. ఆతర్వాత ఇరు జట్లు గోల్స్ చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. 36 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్న భారత్ మొదటి మ్యాజ్లో తీవ్ర పోరాటాన్ని జరిపి అభిమానులను ఆకట్టుకుంది.