క్రీడాభూమి
భారత్ ‘ఎ’ 169/9 నాలుగు దేశాల ‘ఎ’ సిరీస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 September 2016
బ్రిస్బేన్, సెప్టెంబర్ 15: నాలుగు దేశాల ‘ఎ’ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా ‘ఎ’తో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ 169 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ‘ఎ’ కెప్టెన్ జో బర్న్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ ‘ఎ’ టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. అయితే, లోయర్ మిడిల్ ఆర్డర్లో హర్దిక్ పాండ్య (79 నాటౌట్) ఒంటరి పోరాటం కొనసాగించడంతో భారత్ ‘ఎ’కు ఈమాత్రం స్కోరు సాధ్యమైంది. జయంత్ యాదవ్ 28 పరుగులతో, జట్టును ఆదుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కేన్ రిచర్డ్సన్, జాక్సన్ బర్డ్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు.