క్రీడాభూమి

హెచ్‌ఐఎల్‌కు భారీ ప్రైజ్‌మనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టోర్నమెంట్ భారీ ప్రైజ్‌మనీతో కళకళలాడనుంది. ఈనెల 18 నుంచి వచ్చేనెల 21వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో విజేత జట్టుకు 2.50 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. రన్నరప్ జట్టుకు 1.75 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు. మూడో స్థానంలో నిలిచే జట్టుకు 75 లక్షల రూపాయలు లభిస్తాయి. దేశంలోని ఆరు వేర్వేరు నగరాల్లో జరిగే ఈ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్‌మనీ 5.70 కోట్ల రూపాయలు. వీటితోపాటు ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్‌కు 50 లక్షల రూపాయలు లభిస్తాయి. గోల్ ఆఫ్ ది మ్యాచ్‌కి ఇచ్చే మొత్తాన్ని 50 వేల రూపాయలకు పెంచారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు కూడా ఇదే మొత్తాన్ని ఇవ్వనున్నారు.