క్రీడాభూమి

ప్రపంచ టెస్టు బౌలింగ్‌లో అశ్విన్, జడేజా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 8: ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ మొదటి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆదివారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో అశ్విన్ 887 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో నిలవగా, జడేజా 879 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన జొష్ హాజెల్‌వుడ్ ఏకంగా 29 పాయింట్లును తన ఖాతాలో వేసుకొని, మూడో స్థానానికి చేరాడు. దక్షిణాఫ్రికా బౌలర్ కాగిసో రబదా తొమ్మిది స్థానాలను అధిరోహించి, ఎనిమిదో స్థానానికి చేరాడు. కాగా, బౌలింగ్ ‘టాప్-20’లో భారత బౌలర్లలో అశ్విన్, జడేజాతోపాటు మరొకరికి మాత్రమే చోటు దక్కింది. మహమ్మద్ షమీ 19వ స్థానంలో ఉన్నాడు.
రెండో స్థానంలోనే కోహ్లీ
టెస్టు బ్యాటింగ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. స్మిత్ నాలుగు ర్యాంకింగ్ పాయింట్లును కోల్పోయినప్పటికీ, మొత్తం 933 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ ఖాతాలో 875 పాయింట్లు ఉన్నాయి.

చిత్రం..రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్