క్రీడాభూమి

మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్‌లో సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరావక్, జనవరి 18: భారత స్టార్ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరింది. రెండో రౌండ్‌లో ఆమె 21-9, 21-8 తేడాతో థాయిలాండ్‌కు చెందిన చాసినీ కొరెపప్‌పై విజయం సాధించింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఇప్పటి వరకూ టైటిల్ సాధించలేకపోయినా ఆమె ఈ టోర్నీలో ఆ లోటును భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఉంది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ కూడా ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. అతను రెండో రౌండ్‌లో మలేసియా ఆటగాడు జున్ హవో లియోంగ్‌ను 21-10, 17-21, 21-14 తేడాతో ఓడించాడు. కాగా, హేమంత గౌత 5-21, 19-21 తేడాతో చున్ వెయ్ చెన్ చేతిలో పరాజయాన్ని చవిచూశాడు.
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కొత్తగా జత కట్టిన అమనూ అత్రి, జ్వాలా గుత్తా కూడా ముందంజ వేశారు. వీరు 21-19, 21-18 ఆధిక్యంతో లుకీ అప్రి నుగ్రొహొ, రిరిన్ అమెలియా జోడీని ఓడించారు. మహిళల డబుల్స్‌లో అపర్ణా బాలన్, ప్రజాక్తా సావంత్ జోడీ 21-10, 21-11 స్కోరుతో అగిన్సా ఫత్కూల్ లైలీ, అప్రిససీ పుత్రి లెజార్సార్ వెరియెల్లా జోడీపై వరుస సెట్లలో విజయం సాధించింది.