క్రీడాభూమి

న్యూజిలాండ్‌తో డేవిస్ కప్ భారత్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 3: న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన డేవిస్ కప్ ఆసియా/ ఓషియానియా గ్రూప్-1 డేవిస్ కప్ పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. రెండు సింగిల్స్‌లోనూ భారత ఆటగాళ్లు విజయాలు నమోదు చేసి, 2-0 ఆధిక్యాన్ని సంపాదించిపెట్టారు. తొలి మ్యాచ్‌లో యుకీ భంబ్రీ 6-4, 6-4, 6-3 ఆధిక్యంతో ఫిన్ టియర్నీని ఓడించాడు. మరో మ్యాచ్‌లో రాంకుమార్ రామనాథన్ 6-3, 6-4, 6-3 తేడాతో జోస్ స్ట్థామ్‌పై గెలిచాడు. కాగా, శనివారం నాటి డబుల్స్ మ్యాచ్‌లో జాతీయ చాంపియన్ విష్ణువర్ధన్‌తో కలిసి వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ బరిలోకి దిగుతాడు. ఇప్పటికే 42 డేవిస్ కప్ విజయాలను సాధించిన పేస్, ఈసారి కూడా నెగ్గితే, ఈ పోటీల్లో అత్యధిక డబుల్స్ మ్యాచ్‌లను గెల్చుకున్న ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టిస్తాడు.