క్రీడాభూమి

దుబాయ్ ఓపెన్ ఫైనల్‌కు బొపన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మార్చి 3: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నెంబర్ వన్ డబుల్స్ ఆటగాడు రోహన్ బొపన్న, అతని కొత్త భాగస్వామి మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలెండ్) టైటిల్‌కు చేరువయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వీరు భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, గులెర్మో గార్సికా లోపెజ్ (స్పెయిన్) జోడీపై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో అన్‌సీడెడ్ జోడీగా బరిలోకి దిగిన బొపన్న, మట్కోవ్‌స్కీ ఆరంభం నుంచే ఎంతో మెరుగైన ఆట తీరును ప్రదర్శించి తొలి సెట్‌ను 6-3 తేడాతో కైవసం చేసుకున్నారు. అయితే రెండో సెట్‌లో పేస్, లోపెజ్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవడంతో 3-6 తేడాతో ఆ సెట్‌ను కోల్పోయిన బొపన్న, మట్కోవ్‌స్కీ హోరాహోరీగా సాగిన నిర్ణాయక మూడో సెట్‌లో పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి 10-6 తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించారు. ఫైనల్‌లో వీరు టాప్‌సీడ్స్‌గా బరిలోకి దిగిన హెన్రీ కొంటినెన్, జాన్ పీర్స్ జోడీతో గానీ, లేక నాలుగో సీడ్స్‌గా బరిలోకి దిగిన రోజెర్ జీన్ జులియన్, టెకు హోరియా జోడీతో గానీ తలపడనున్నారు.