క్రీడాభూమి

ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ క్వార్టర్స్‌కు సైనా, సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింహామ్, మార్చి 9: భారత స్టార్లు సైనా నెహ్వాల్, పివి సింధు ఇక్కడ జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరారు. గురువారం నాటి రెండో రౌండ్ మ్యాచ్‌లో సైనా ఎలాంటి కష్టం లేకుండా, తన ప్రత్యర్థి ఫాబియానే డిప్రెజ్‌ను 21-18, 21-6 తేడాతో చిత్తుచేసింది. ఆమె విజృంభణకు కళ్లెం వేయడానికి మొదటి సెట్‌లో విశేషంగా శ్రమించిన డిప్రెజ్ రెండో సెట్‌లో గట్టిపోటీని ఇవ్వకుండానే చేతులెత్తేసింది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21-12, 21-4 ఆధిక్యంతో డియాన్ డియా అయుస్టిన్‌పై గెలిచి, క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈమె కూడా ప్రత్యర్థిని సునాయాసంగా ఓడించడం విశేషం. కాగా, క్వార్టర్ ఫైనల్స్‌లో వీరిద్దరూ విజయాలను నమోదు చేస్తే, సెమీ ఫైనల్స్‌లో పరపర్పరం తలపడాల్సి ఉంటుంది.
పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఓటమిపాలై నిష్క్రమించాడు. రెండో రౌండ్‌లో అతనిని తియాన్ హౌవెయ్ 21-13, 21-5 తేడాతో ఓడించి క్వార్టర్స్‌లో చోటు సంపాదించాడు. ప్రపంచ నంబర్ వన్ లీ చాంగ్ వెయ్ కూడా క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. అతను రెండో రౌండ్‌లో జూ వెయ్ వాంగ్‌పై 21-18, 21-18 స్కోరుతో విజయం సాధించాడు.

చిత్రాలు.. సైనా నెహ్వాల్ * పివి సింధు