క్రీడాభూమి
‘సాయ్’ పాలక మండలిలో జ్వాలకు చోటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 17 March 2017
న్యూఢిల్లీ, మార్చి 16: భారత బాడ్మింటన్ క్రీడాకారిణి, డబుల్స్ స్పెషలిస్టు జ్వాల గుత్తాకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పాలక మండలిలో చోటు లభించింది. 14 పర్యాయాలు జాతీయ చాంపియన్షిప్ను సాధించిన ఆమెను వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా నియమిస్తున్నట్టు సాయ్ కార్యదర్శి ఎస్ఎస్ చాబ్రా ఒక లేఖలో తెలిపాడు. తదుపరి జరిగే కమిటీ సమావేశానికి హాజరుకావాల్సిందిగా జ్వాలను అతను కోరాడు. కాగా, ఈ నియామకం తనకు ఎంతో ఆనందాన్నిస్తున్నదని జ్వాల ఒక ప్రకటనలో తెలిపింది. భారత బాడ్మింటన్ రంగానికి శక్తి వంచన లేకుండా సేవలు అందిస్తానని చెప్పింది.