క్రీడాభూమి
కింగ్స్ ఎలెవెన్లో ఇశాంత్కు చోటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: టీమిండియా సీనియర్ స్పీడ్స్టర్ ఇశాంత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తరఫున ఆడనున్నాడు. టెస్టు క్రికెట్లో భారత్కు 77 మ్యాచ్లలో ప్రాతినిథ్యం వహించిన ఇశాంత్పై ఫిబ్రవరిలో నిర్వహించిన ఐపిల్-10 ఆటగాళ్ల వేలంలో అన్ని జట్ల యాజమాన్యాలు శీతకన్ను వేసిన విషయం విదితమే. ఈ వేలంలో ఇశాంత్ పేరు రెండుసార్లు తెరమీదికి వచ్చినప్పటికీ ఏ జట్టూ అతడిని కొనుగోలు చేయలేదు. అతని బేస్ ప్రైస్ (ప్రారంభ ధర)ను భారీ మొత్తంలో 2 కోట్లుగా నిర్ణయించడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే వీరేంద్ర సెవాగ్ సూచన మేరకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ యాజమాన్యం మంగళవారం ఇశాంత్ను తమ జట్టులో చేర్చుకుంది. దీంతో పొట్టి ఫార్మాట్లో ఇశాంత్ కెరీర్కు పెద్ద ఊతం లభించినట్లయింది. తీరికగా ఉంటే తనను కలవాలని వీరూ భాయ్ (సెవాగ్) రెండు రోజుల క్రితం తనకు ఫోన్ చేశాడని, ఆ విధంగా తనకు కింగ్స్ ఎలెవెన్ జట్టులో చోటు లభించిందని ఇశాంత్ పిటిఐ వార్తా సంస్థకు వివరించాడు.