క్రీడాభూమి

9న కొత్త కోచ్ ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 30: ఇండియా క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌ను జూలై 9న ప్రకటిస్తామని బిసిసిఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు. శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి వేకువజామున స్వామివారికి నిర్వహించే సుప్రభాతం సేవలో పాల్గొన్నాడు. అనంతరం ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఐసిసి చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బాగా ఆడిందన్నాడు. అయితే దురదృష్టవశాత్తు తుది పోరులో ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నాడు. ఇకపై టీమిండియా దృష్టి అంతా 2019 ప్రపంచకప్‌పైనే కేంద్రీకృతమవుతుందని, టైటిల్ కోసం ఇప్పటి నుంచే సిద్ధవౌతోందన్నాడు. 2019 వరల్డ్‌కప్‌ను గెలిచి తిరుమల శ్రీవారికి బహుమతిగా ఇస్తామన్నాడు. 2019లో ప్రపంచకప్ ఇంగ్లాడ్‌లోనే జరుగుతుందని అందుకు తగిన విధంగా జట్టు సిద్ధమవుతోందని తెలిపాడు. ప్రస్తుతం ఆ దిశగా టీమిండియా రాణిస్తుందని తనకు బాగా తృప్తిగా ఉందన్నాడు. రానున్న కాలంలో జట్టులో యువ ఆటగాళ్లకు చోటు కల్పిస్తామని చెప్పాడు.