క్రీడాభూమి

రెండు పతకాలు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, జూలై 3: బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. క్వార్టర్ ఫైనల్ బౌట్లలో బూర నవీన్, అంకిత్ తమతమ ప్రత్యర్థులను మట్టికరిపించి భారత్‌కు ఈ పతకాలను ఖాయం చేశారు. 69 కిలోల విభాగంలో నవీన్ చైనాకు చెందిన హువాంగ్ రుయిని చిత్తు చేయగా, మరో క్వార్టర్ ఫైనల్ పోరులో అంకిత్ కిర్గిస్థాన్‌కు చెందిన అడిలెట్ ఎగెన్‌బెర్డి యులూను మట్టికరిపించి మెడల్ రౌండ్‌కు దూసుకెళ్లాడు. అయితే 52 కిలోల విభాగంలో సుదీప్ కుమార్, 81 కిలోల విభాగంలో ఆశిష్ తమతమ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలవడంతో భారత శిబిరంలో కొంత నిరాశ ఏర్పడింది.