క్రీడాభూమి
టీమిండియా కోచ్ పదవికి రవిశాస్ర్తీ, సిమ్మన్స్ దరఖాస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, జూలై 3: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మాజీ డైరెక్టర్ రవిశాస్ర్తీ సోమవారం లాంఛనంగా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతను ఈ పదవి కోసం పోటీపడుతున్న వారిలో ముందు నిలిచాడు. రవిశాస్ర్తీతో పాటు వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ ఫిల్ సిమ్మన్స్ కూడా ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించాడు. టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 9వ తేదీతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజు టీమిండియా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, సచిన్ తెండూల్కర్, హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్మన్ వివిఎస్.లక్ష్మణ్తో కూడిన బిసిసిఐ క్రికెట్ సలహా కమిటీ (సిఎసి) అభ్యర్థులకు ఇంటర్యూలు నిర్వహిస్తుంది. టీమిండియా కోచ్ పదవి కోసం వీరేందర్ సెవాగ్, టామ్ మూడీ, వెంకటేష్ ప్రసాద్, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్, లాల్చంద్ రాజ్పుట్ కూడా ఇప్పటికే బరిలోకి దిగిన విషయం తెలిసిందే.