క్రీడాభూమి
‘డబుల్స్’లో సానియా ముందంజ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వింబుల్డన్, జూలై 9: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా అటు మహిళల డబుల్స్లో, ఇటు మిక్స్డ్ డబుల్స్లో మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. మహిళల డబుల్స్లో బెల్జియం దేశానికి చెందిన కిర్స్టెన్ ఫ్లిప్కెన్స్తో కలిసి బరిలోకి దిగిన సానియా 6-3, 3-6, 6-4 తేడాతో నవోమీ బ్రాడీ, హీతర్ వాట్సన్ జోడీని ఓడించి మూడో రౌండ్ చేరింది. క్వార్టర్ ఫైనల్స్లో చోటు కోసం సానియా, ఫ్లిప్కెన్స్ జోడీ మూడో రౌండ్లో మార్టినా హింగిస్, యంగ్ జాన్ చాన్ జోడీని ఢీ కొంటుంది. కాగా, మిక్స్డ్ డబుల్స్లో క్రొయేషియా ఆటగాడు ఇవాన్ డోడింగ్తో కలిసి పోటీపడుతున్న హైదరాబాదీ సానియా 78 నిమిషాలపాటు పోరాటం సాగించి జపాన్కు చెందిన యుసుకే వటానుకి, మకొటో నినొమియా జోడీపై 7-6, 6-2 తేడాతో నెగ్గింది. సానియా, డోడింగ్ మూడో రౌండ్లో హెన్రి కొంటినెన్, హీతర్ వాట్సన్ జోడీని ఓడించింది. ఇరావుంటే, వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో మిచా జ్వెరెవ్ను 7-6, 6-4, 6-4 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరాడు. యువ సంచలన ఆటగాడు, మిచా జ్వెరెవ్ సోదరుడు అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-4, 6-4, 6-2 ఆదిక్యంతో సెబాస్టియన్ ఆఫ్నర్పై విజయం సాధించాడు. మరో మ్యాచ్లో థామస్ బెర్డిచ్ 6-3, 6-4, 6-3 స్కోరుతో డేవిడ్ ఫెరర్ను ఓడించాడు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో కొకో వాండెవాగే 6-2, 6-4 తేడాతో ఎలీసన్ రిస్కేపై గెలిచింది.
చిత్రం.. సానియా మీర్జా