క్రీడాభూమి

టెస్టు జట్టులో హార్దిక్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: శ్రీలంక పర్యటనలో భాగంగా, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడే టీమిండియాలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు చోటు దక్కింది. ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తున్న అతను వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లోనేగాక, టెస్టులోనూ సత్తా చాటుతాడని సెలక్టర్లు నమ్మకం ఉంచారు. ఇలావుంటే, సీనియ ర్ ఆటగాడు రోహిత్ శర్మకు మళ్లీ టెస్టు జట్టులో స్థానం లభించింది. గాయాల కారణంగా కొంతకాలం టెస్టు లకు దూరంగా ఉన్న కెఎల్ రాహుల్, మురళీ విజయ్ కూడా తిరిగి జట్టులో చేరారు. శిఖర్ ధావన్ కంటే అ భినవ్ ముకుంద్‌కే సెలక్టర్లు ప్రాధాన్యం ఇచ్చారు. విరాట్ కోహ్లీ నాయత్వం వహిస్తున్న ఈ జట్టు లంకతో మూ డు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది.
జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కెఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్.

చిత్రం.. హార్దిక్ పాండ్య