క్రీడాభూమి

బెంగాల్ చేతిలో యుపి యోద్ధ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, ఆగస్టు 6: ప్రో కబడ్డీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యుపి యోద్ధను బెంగాల్ వారియర్స్ 20 పాయింట్ల తేడాతో చిత్తుచేసింది. బెంగాల్ 40 పాయింట్లు సాధించగా, శనివారం బెంగళూరు బుల్స్‌ను ఓడించి సంచలనం సృష్టించిన యుపి యోద్ధ ఈ మ్యాచ్‌లో నీరుగారిపోయి, 20 పాయింట్లతో సరిపుచ్చింది. బెంగాల్ తరఫున వినోద్ కుమార్ 8, జంగ్ కున్ లీ 7, మనీందర్ సింగ్ 6, రాన్ సింగ్ 5 చొప్పున పాయింట్లు చేసి, ఆ జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు. యుపి యోద్ధ ఆటగాళ్లలో సురేందర్ సింగ్ 5, రాజేష్ నర్వాల్ 3 పాయంట్లు సాధించారు.
మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌పై పాట్నా పైరేట్స్ 38-22 తేడాతో ఓడించింది. ప్రదీప్ నర్వాల్ 13 పాయింట్లతో కదంతొక్కగా, వినోద్ కుమార్ 7, మోన్ గయాత్ 5 చొప్పున పాయింట్లు చేసి, పాట్నాను బలమైన స్థితిలో నిలిపారు. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ (7), అజయ్ కుమార్ (6) తప్ప మిగతా వారు రాణించలేకపోయారు.