క్రీడాభూమి

భారత్, చైనా మైత్రి కోసం నా టైటిల్ ఇచ్చేస్తా: విజేందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 6: చైనా బాక్సర్ జుల్పీకర్ మైమైతియాలిని ఓడించి తాను సాధించిన డబ్లుబివో ఓరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను అతనికే తిరిగి ఇచ్చేస్తానని భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రకటించాడు. భారత్, చైనా దేశాల మధ్య శాంతి నెలకొలడానికి ఈ చర్య ఉపయోగపడితే తాను చాలా ఆనందిస్తానని తెలిపాడు. డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ విభాగంలో ఇప్పటికే చాంపియన్‌గా ఉన్న విజేందర్ శనివారం నాటి ఫైట్‌లో జుల్పీకర్‌పై గెలిచి ఓరింటల్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను కూడా సాధించాడు. అయితే, తాను భారత్, చైనా మైత్రీ సంబంధాలను ఆకాంక్షిస్తున్నానని, కాబట్టి జుల్పీకర్‌కు అతని టైటిల్‌ను తిరిగి ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. క్రీడల వల్ల దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగవుతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.