క్రీడాభూమి

హెల్లస్ ఓపెన్‌లో కపూర్-గార్గ్‌కు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లివాడియా (గ్రీస్), సెప్టెంబర్ 3: హెల్లస్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాడ్మింటన్ సిరీస్‌లో భారత్‌కు చెందిన రోహన్ కపూర్, కుహూ గార్గ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్ పోరులో వీరు 21-19, 21-19 గేముల తేడాతో భారత్‌కే చెందిన ఉత్కర్ష్ ఆరోరా, కరిష్మా వాడ్కర్ జోడీపై విజయం సాధించారు. ఆరంభం నుంచే పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించి ఆడిన కపూర్, గార్గ్ కేవలం 35 నిమిషాల వ్యవధిలోనే ప్రత్యర్థులను మట్టికరపించి సత్తా చాటుకున్నారు.