క్రీడాభూమి

ప్రో కబడ్డీ లీగ్ రెండూ ‘టై’లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనేపట్, సెప్టెంబర్ 8: ప్రో కబడ్డీలో శుక్రవారం జరిగిన రెండు మ్యాచ్‌లూ టైగానే ముగియడం విశేషం. హర్యానా స్టీలర్స్, పాట్నా పైరేట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇరు జట్లు 41 పాయింట్లు చేశాయి. హర్యానా తరఫున వజీర్ సింగ్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా, సుర్జీత్ సింగ్ 9, మోహిత్ చిల్లార్ 5 చొప్పున పాయింట్లు సాధించారు. పాట్నా ఆటగాళ్లలో పర్‌దీప్ నర్వాల్ 13 పాయింట్లు చేశాడు. మోనూ గోయట్ 11, విజయ్ 5 చొప్పున పాయింట్లు రాబట్టారు. మొత్తం మీద ఆటలో 82 పాయింట్లు నమోదు కావడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కాగా, గుజరాత్ ఫార్ట్యూన్‌జెయంట్స్, యుపి యోద్ధ మధ్య మ్యాచ్ కూడా టై అయంది. ఇరు జట్లు చెరి 30 పాయంట్లు సాధించాయ. గురజాత్ తరఫున సుకేష్ హెగ్డే 5, చంద్రన్ రంజిత్ 4, యుపి తరఫున నితిన్ తోమర్ 8, రిశాంక్ దేవాడిగ 6, జీవన్ కుమార్, నితేష్ కుమార్ చెరి 5 చొప్పున పాయంట్లను నమోదు చేశారు.