క్రీడాభూమి

ధావన్‌కు సెలవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన టీమిండియాలో స్థానం సంపాదించిన శిఖర్ ధావన్‌కు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సెలవు మంజూరు చేసింది. తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా, ఈ మూడు మ్యాచ్‌ల నుంచి తనను తప్పించాలని ధావన్ చేసిన విజ్ఞప్తిపై బిసిసిఐ సానుకూలంగా స్పందించింది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో వనే్డ ఇంటర్నేషనల్స్ ముగిసిన తర్వాత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన తల్లికి సేవలు అందించేందుకు వీలుగా అతను జట్టును వీడి ఇంటికి వెళ్లేందుకు అనుమతి తీసుకున్నాడు. ఇలావుంటే, ధావన్ స్థానంలో మరో ఆటగాడిని జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు.