క్రీడాభూమి
ఆసీస్ టి-20 జట్టులోకి ఆండ్రూ టై
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బెంగళూరు, సెప్టెంబర్ 26: టీమిండియాతో మూడు మ్యాచ్ల అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్లో తలపడేందుకు ఆస్ట్రేలియా ప్యాట్ కమ్మిన్స్ స్థానంలో పేసర్ ఆండ్రూ టైని జట్టులోకి తీసుకుంది. ఐదు మ్యాచ్ల వనే్డ సిరీస్లో భాగంగా ఇప్పటివరకూ టీమిండియాతో జరిగిన మూడు మ్యాచ్లలోనూ ప్యాట్ కమ్మిన్స్ ఆడిన విషయం తెలిసిందే. అయితే త్వరలో ఇంగ్లాండ్తో జరుగనున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ను దృష్టిలో ఉంచుకుని కమ్మిన్స్కు విశ్రాంతి కల్పించాలని ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యం ఇటీవల నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం మేరకే టీమిండియాతో టి-20 సిరీస్లో తలపడే ఆస్ట్రేలియా జట్టులో ఆండ్రూ టైకి చోటు కల్పించారు. టి-20 క్రికెట్లో స్పెషలిస్టుగా పేరు పొందిన ఆండ్రూ టై ఆస్ట్రేలియా జట్టులో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్లు ఆడాడు. టీమిండియాతో వచ్చే నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల టి-20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా ప్యాట్ కమ్మిన్స్ స్థానంలో ఆండ్రూ టైని జట్టులోకి తీసుకున్నట్లు ‘క్రికెట్.కామ్.ఎయు’ వెబ్సైట్ వెల్లడించింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ అక్టోబర్ 7వ తేదీన రాంచీలో జరుగనుండగా, రెండవ మ్యాచ్ని 10వ తేదీన గౌహతిలోనూ, మూడో మ్యాచ్ని 13వ తేదీన హైదరాబాద్లోనూ నిర్వహించనున్నారు.
చిత్రం..కమ్మిన్స్ స్థానంలో చోటు దక్కించుకున్న ఆండ్రూ టై