క్రీడాభూమి

హాకీ లీగ్‌లో భారత్ ‘ఎ’ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, సెప్టెంబర్ 29: ఆస్ట్రేలియా హాకీ లీగ్ టోర్నమెంట్‌లో భారత్ ‘ఎ’ జట్టు శుభారంభం చేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ని 4-1 తేడాతో గెల్చుకుంది. మ్యాచ్ ఆరో నిమిషంలోనే అర్మాన్ ఖురేషి భారత్ ‘ఎ’కు తొలి గోల్‌ను అందించాడు. ఆతర్వాత అఫాన్ యూసుఫ్ 30, అమిత్ రోహిదాస్ 45, తల్వీందర్ సింగ్ 50 నిమిషాల్లో గోల్స్ సాధించి, భారత్ ఆధిక్యాన్ని పెంచారు. వెస్టర్స్ ఆస్ట్రేలియా తరఫున 56వ నిమిషంలో లియామ్ ఫ్లిన్ ఓ కంటి తుడుపు గోల్‌ను నమోదు చేశాడు. కాగా, శనివారం న్యూ సౌత్ వేల్స్‌తో భారత్ ‘ఎ’ తలపడుతుంది.