క్రీడాభూమి

బిసిసిఐ నిర్వాకం.. అభిమానుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు ఆస్ట్రేలియాతో టీమిండియా వనే్డ సిరీస్‌లో ఆడుతున్నదా లేక టి-20 మ్యాచ్‌లో పోటీపడుతున్నదా అనే విషయం కూడా తెలియదా? అసలు మ్యాచ్ గురించిన వివరాలే తెలియనంత మత్తులో బోర్డు అధికారులు జోగుతున్నారా? అభిమానులు ఆగ్రహంతో సంధిస్తున్న ప్రశ్నలివి. గురువారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో వనే్డ ప్రారంభమైనప్పుడు బిసిసిఐ పెట్టిన పోస్ట్ వివాదానికి కారణమైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సమాచారాన్ని సరైన రీతిలో అందించడంలో బోర్డు విఫలమైంది. తన అధికార వెబ్‌సైట్‌లో ‘నాలుగో వనే్డ’ అనడానికి బదులు టి-20 మ్యాచ్‌లో అని రాసింది. చాలా సేపు ఆ పోస్టింగ్‌ను మార్చలేదు. ఆస్ట్రేలియాతో ఇప్పుడు వనే్డ సిరీస్ జరుగుతున్న విషయం కూడా బోర్డుకు తెలియకపోవడం దురదృష్టకరమని ఆ పోస్టింగ్‌పై స్పందిస్తూ వేలాది మంది అభిమానులు కామెంట్లు పెట్టారు. పొరపాటును ఆలస్యంగా తెలుసుకున్న బోర్డు అధికారులు తీరిగ్గా సవరణను ఉంచారు.