క్రీడాభూమి

అశ్విన్, జడేజాకు ‘రెస్ట్’పై అభిమానుల మండిపాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పేర్లు లేకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. సెలక్టర్ల తీరును తప్పుపడుతున్నారు. ఆశిష్ నెహ్రా వంటి వెటరన్ ఫాస్ట్ బౌలర్‌కు అవకాశమిచ్చి, అశ్విన్, జడేజాను విస్మరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ‘రెస్ట్’ పేరుతో వారికి అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 7 (రాంచీ), 10 (గౌహతి), 13 (హైదరాబాద్) తేదీల్లో ఆసీస్‌తో జరిగే టి-20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాను సెలక్టర్లు ప్రకటించగా, ఎవరూ ఊహించని విధంగా నెహ్రాకు చోటు దక్కింది. అతనితో పోలిస్తే మెరుగ్గా రాణించే అశ్విన్, జడేజాను సెలక్టర్లు విస్మరించారు. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తున్నామని ప్రకటించుకుంటున్న సెలక్టర్లు పలువురు సమర్థులకు ‘విశ్రాంతి’ పేరుతో అన్యాయం చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలావుంటే, అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు సేవలు అందించేందుకు వనే్డ సిరీస్‌కు దూరమైన శిఖర్ ధావన్‌కు టి-20 జట్టులో చోటు లభించింది. నెహ్రా, దినేష్ కార్తీక్ జట్టులోకి వచ్చారు.
జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, కేదార్ జాధవ్, హార్దిక్ పాండ్య, మనీష్ పాండే, మహేంద్ర సింగ్ ధోనీ, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్.